నేడు ఆలేరుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

ఆలేరు: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ ఈ రోజు ఆలేరుకు రానున్నారు. పట్టణానికి మంజూరైన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆయన ఈ సాయంత్రం ప్రారంభించనున్నారు. అంతకుముందు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు.