నేడు కెటిఆర్‌ జన్మదినం

వర్షాలతో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం

హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన
మేరకు ’గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జులై 24న మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ’గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.