నేడు తెలంగాణ రచయితల వేదిక సదస్సు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తెలంగాణ రచయితల వేదిక వరంగల్‌ జిల్లా శాఖ రెండవ మహాసభలు

29న ఆదివారం వరంగల్‌లో జరుగనున్నాయి. నిట్‌ కాలేజీ దగ్గరలోని తారా గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మహాసభలలో ‘కలాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. ప్రారంభ సభలో అన్వర్‌, హరగోపాల్‌, అల్లం రాజయ్య, జింబో, జస్టిస్‌ చంద్రకుమార్‌ తదితరులు పాల్గొంటారు. భోజనవిరామం అనంతరం రెండు సదస్సులు, ముగింపు సభ ఉంటాయి. మొదటి సదస్సులో కాత్యాయని విద్మహే ప్రసంగిస్తారు. రెండవ సదస్సులో ఎ.కె. ప్రభాకర్‌ ప్రసంగిస్తారు. ముగింపు సభలో ప్రజా గాయకులు విమలక్క, జూకంటి జగన్నాథం, నల్లెల్ల రాజయ్య, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌. జీవన్‌కుమార్‌, గాజోజు నాగభూషణం, అడపరాజు పాల్గొంటారు. కళాబృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.