నేతల ఇళ్లకు తాళం

నల్గొండ : మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారుల రంగం సిద్ధం చేశారు. కాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళాలు వేయాలని జిల్లా కలెక్టర్‌ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రేపాడ శ్రీనివాస్‌ సహా పలువురు నేతలు నివాసముంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత చేపట్టాలి.