నోటీసులు అందుకున్న మంత్రులకు సర్కార్‌ అండ

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 26 వివాదాస్పద జీవోలై నలుగురు మంత్రుకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న వారిలో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ధార్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలు ఉన్నారు.