నోవా కళాశాల విద్యార్థుల ర్యాలీ
అబ్దుల్లాపూర్మెంట్: దిల్సుఖ్నగర్లో నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన నోవా కళాశాల విద్యార్థి ఆనంద్కు హయత్నగరం మండలం, జాఫర్ గూడలోని నోవా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. అనంతరం నోవా కళశాల నుంచి అబ్దుల్లాపూర్మెంట్ వరకు ర్యాలీ చేపట్టారు. నోవా కళాశాలకు చెందిన శ్రావణిగౌడ్, విజయ్ప్రసాద్లు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించురు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.