పట్టణంలోని సాయి దేవాలయంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు

హుజూర్ నగర్ డిసెంబర్ 7 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు బుధవారం హుజూర్ నగర్ ఆర్డిఓ వెంకారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు త్రిపురమళ్ళ అంజయ్య, కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు, టీ. శేఖర్, కే.నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా సాయి మందిరంలో బుధవారం అన్నదాన కార్యక్రమానికి ఏలూరు రాంబాబు, గజ్జి ప్రభాకర్, ఓరుగంటి నాగేశ్వరరావు, త్రిపురమళ్ళ అంజయ్య, కుక్కుడపు రామ్మోహన్ రావు, టి శేఖర్ బోనాల కృష్ణారావు సహకరించారని తెలిపారు.