పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి)  ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం  ఏర్పడిన నుండి ఇప్పటివరకు ఒక్క పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వలన లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలతో కాలం గడుపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు, టి సి ఎస్ నుండి ఆదిభట్ల వరకు లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పట్టణ ప్రగతి లో తీర్మానించారు, ఆదిభట్ల లో జరిగిన అభివృద్ధి పనులు మరియు జరగాల్సిన వాటిపై సమీక్షించారు, ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి,ఎఈ వీరాంజనేయులు, ఆదిభట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి,నాయకులు బుపతి గళ్ళ రాజు, సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్,సురేష్,నర్సింహ, కాలనీ వాసులు,యువకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.