పట్టణ ప్రగతి తోనే డివిజన్లో అభివృద్ధి కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 8
పట్టణ ప్రగతి తోనే కాలనీలు అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బుధవారం అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ చంద్ర పురం కాలనీ బిహెచ్ఇయల్ కాలనీ గంగపుత్ర కాలనీ లోని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి  వివిధ కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లు కాలనీలు అభివృద్ధి చెందేందుకు పట్టణ ప్రగతి ఎంతో కీలకమని కాలనీలలో చెత్త డ్రైనేజీలు మంచినీటి సమస్యలు విద్యుత్ సమస్యను శానిటేషన్ తో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మున్సిపల్ అధికారులు ఎంతో దోహదపడుతుందని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి హేమలత, హరిబాబు, శానిటేషన్ అధికారి బుచ్చయ్య, జలమండలి అధికారి శేఖర్, స్థానిక నాయకులు కవిత, లోకేష్, ప్రేమ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.