పట్టణ ప్రగతి లో భాగంగా కార్పొరేటర్ పాదయాత్ర

నాచారం(జనంసాక్షి): పట్టణ ప్రగతి లో భాగంగా శనివారం రవీంద్ర నగర్ కాలనీలో అధికారులతో కలిసి కార్పోరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ విస్తృతంగా పర్యటించారు.  రవీంద్ర నగర్ లో దాదాపుగా అన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. అందులకు గాను స్థానిక ప్రజలు కార్పొరేటర్ ను అభినందించారు. శానిటేషన్ సిబ్బంది  తో  అన్ని వీధులను శుభ్రం చేయించారు. ఎక్కడ కూడా మట్టి కుప్పలు లేకుండా తొలగించడం జరిగింది .ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి,  ఏఎంసీ సురేందర్, ఏ.ఈ దయ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.