పత్తి మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

మెడ్జిల్‌: మండలపరిధిలోని వూరుకొండపేట పత్తిమిల్లు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒత్తిళ్లకు పాల్పడుతూ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. వీరికి బీఎంఎన్‌ నేతలు మద్దతు తెలిపారు.