పనిమనిషిపై యజమాని కొడుకు అత్యాచారం

బషీరాబాద్‌, ఆగస్టు 13 : బషీరాబాద్‌ మండలం తాటికందలో పనిమనిషిపై యజమాని కొడుకు అత్యాచారం జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదుతో యజమాని కొడుకుపై నిర్భయ కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి పంపించి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.