పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య.
తొర్రూర్ 22 జూలై( జనంసాక్షి )
 ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని.  చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య  అన్నారు. శుక్రవారం ఆరో వార్డ్ యందు  ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిలో ఉన్న నీటి డ్రమ్ములు,కుండలు, ప్రతి శుక్రవారం కడిగి ఆరబెట్టుకోవాలని,ఇంటి చుట్టు పక్కన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.పరిశుభ్రమైన కూరగాయలు వంట చేసుకుని వేడిగా ఉన్న భోజనాలు తీసుకోవాలన్నారు. భోజనానికి ముందు పరిశుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కుని భోజనం చేయాలన్నారు.మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. దీంతో తో డెంగ్యూ, మలేరియా వ్యాధులను అరికట్టవచ్చని, అనంతరం  కాలువల లో బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించారు. సిబ్బంది కి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  జవాన్  రాజశేఖర్ సిబ్బంది  వెంకన్న. మురళి .తదితరులు పాల్గొన్నారు
Attachments area