పర్యావరణ పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
సొసైటీ-చైర్మెన్.ఎగుల నర్సింలు
ఎల్లారెడ్డి  అక్టోబర్ 23(జనంసాక్షి) మండల ప్రజలకు సొసైటీ చేర్ మేన్        ఏగుల నర్సింలు ఆదివారం మాట్లాడుతూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అన్నారు.ఈ దీపావళి ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ పర్వదినం సందర్భంగా  ఎల్లారెడ్డి ప్రజలందరికీ సకల శుభాలు, పాడి పంటలు సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు.దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు ప్రతీక దీపావళి పండుగ అన్నారు.జగతిని జాగృతిచేసే  శోభావళి,ప్రతి ఇంటా ఆనందదివ్వె లు వెలగాలని కోరారు.ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.ఒకొక్క అడుగు ముందుకు వేసి మండల అభివృద్ధి సాధించాలని,ఈ దీపావళి  ప్రజలులందరి  జీవితాల్లో వెలుగులు నింపాలని , అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తేజోత్సవంగా దీపావళి అని అభివర్ణించారు.పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ సంబురాలను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆనందపు వెలుగులు నింపాలన్నారు.
Attachments area