పలు కుటుంబాలను పరామర్శించిన: పాయం.

 

బాధితులకు ఆర్థిక సాయం అందించిన పాయం…

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రెడ్డిపాలెం గ్రామం లో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
మంచాల మంగమ్మ
కొద్దిరోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకుని
బుధవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు. అదే గ్రామానికి చెందిన ఆవుల జయరామిరెడ్డి పక్షవాతంతో బాధపడుతున్న క్రమంలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని, ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, ఎడమకంటి పిచ్చిరెడ్డి, పాలం లక్ష్మిరెడ్డి, ఎడమకంటి పెద్ద రోషిరెడ్డి, ఆవుల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.