పలు డివిజన్లలో కమిషనర్ పర్యటన వైన్స్ లు, ఫంక్షన్ హాళ్లకు భారీ జరిమానా మేడిపల్లి – జనంసాక్షి

పట్టణ ప్రగతి  కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ నగర పాలక సంస్థ కమీషనర్ పద్మజా రాణి పలు డివిజన్లలో పర్యటించారు. ఈ క్షేత్ర పర్యటనలో పలు ఫంక్షన్ హాల్, వైన్స్ ల పరిసరాలు పారిశుధ్య స్థితిగతులను  పరిశీలించగా.. అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, గ్లాసులు, చెత్త ఉండడం గమనించి వారికి  భారీగా జరిమానా విధించారు. రెండు వైన్స్ లకు, రెండు ఫంక్షన్ హాల్స్ కు మొత్తంగా 70వేల జరిమానా విధించడం  జరిగింది. మళ్ళీ అపరిశుభ్రంగా ఉన్నట్లయితే షాప్, ఫంక్షన్  హాల్ లకు భారీ  జరిమానాతో పాటు సీజ్  చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కావున నగర పాలక  సంస్థ ప్రజలు స్వచ్ఛ బోడుప్పల్ కోసం సహకరించాలని కమిషనర్ కోరారు.