పల్స్‌ పోలియో కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌, జనవరి 19 : జిల్లాలో ఆదివారం చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.సాంబశివరావు తెలిపారు. ఐదేళ్ళలోపు పిల్లలు జిల్లాలో సుమారు 3,47,393మంది ఉన్నారని, వీరికి వందశాతం పోలియోచుక్కలేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,208పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  మొత్తం 8,890మంది ఉద్యోగులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందుటుబాటులో ఉంటారన్నారు.