పశువులకు చర్మ వ్యాధి లంపి స్కిన్ టీకాలు

కుబీర్ ( జనం సాక్షి ); నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో లంపి స్కాన్ వైరస్ కలకాలం రేపు తుంది. అప్రమత్తమైన అధికారులు వ్యాధి నివారణ టీకవేస్తున్నారు. ఇందులో భాగంగా కుబీర్ మండలంలోని గోడపూర్ గ్రామపంచాయతీ పరిధిలో లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. వ్యాధి పట్ల రైతులకు అవగాహన కల్పించారు. నాలుగు నెలలు నిండిన పశువులకు టీకాలు వేయించాలని సూచించారు.వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, గోపాల్, జీవన్, అసిస్టెంట్ పవన్, గణపతి రావు, అవధూత్ పటేల్, మొయినుద్దీన్ తదితర రైతులు పాల్గొన్నారు.