పాఠశాలకు విద్యార్థులు 100% హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి

నల్లబెల్లి జులై 19 (జనం సాక్షి):
పాఠశాలకు విద్యార్థులు 100% హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని శనిగరం జడ్పీహెచ్ఎస్ మరియు పిఎస్ పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తయారుచేసిన అకాడమిక్ క్యాలెండర్ ను పాఠశాలలో అమలు చెయ్యాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా నిబంధనలను పాటిస్తూ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సదాశివరావు, బిక్షపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.