“పాఠశాల పరిశీలన,

పెన్ పహాడ్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి) : మండల పరిధిలోని దుపహాడ్ గ్రామం లో ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్, మండల నోడల్ అధికారి వస్త్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థుల పట్ల మంచి చొరవ తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా  మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల స్థితిగతులను మెరుగుపరచడానికి విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ పి నాగయ్య, ఆర్ పి విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ఎం ఎస్ సరళ కుమారి, ఉపాధ్యాయులు ఎం కిరణ్ సింగ్ పాల్గొన్నారు