పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఐలపురం గ్రామవాసి. వ్యక్తి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.