పాతపడ్డ బావిలో తలదాచుకున్న సైకో…

రంగారెడ్డి:బాలాపూర్ సాయినగర్ లో తన కుటుంబంలోని ముగ్గురిని కిరాతకంగా గొంతు కోసి చంపిన సైకో రామిరెడ్డి పాడుబడ్డ బావిలో తలదాచుకున్నాడు. పోలీసులు రాంరెడ్డిని బావిలో నుంచి బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ తగాదాలే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.