పాదయాత్రకు బాబు విరామం

మహబూబ్‌ నగర్‌: వస్తున్నా మీ కోసం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం యాత్రకు విరామం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించేందుకు చంద్రబాబు బుధవారం కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు పర్యటించనున్నారు.