పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక;

ఆర్టిఓఎల్. కిషోర్ కుమార్
కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి )
అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయిస్తున్నట్లు కోదాడ ఆర్టిఓఎల్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో కోదాడ మండల పరిధిలోని బిక్య తండా గ్రామంలో నిర్మించిన 49 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులకు ఇంటి నెంబర్లను లాటరీ పద్ధతిలో కేటాయించి మాట్లాడారు. ప్రభుత్వం దశలవారీగా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తుందని అర్హులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే గౌరవ శాసన సభ్యులు ద్వారా గృహప్రవేశాలు జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ, బిక్యా తండా సర్పంచ్ అంబేద్కర్, కలెక్టరేట్ సూపర్వైజర్ అశోక్, ఏ ఎస్ ఓ రామారావు, ఆర్ఐ నగేష్ ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.