పార్లమెంట్‌ బరిలో ఎవరిని నిలిపినా గెలిపిస్తాం

– దేశంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుంది
– గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి
– తెరాస ఎమ్మెల్యే టి. రాజయ్య
వరంగల్‌, మార్చి4(జ‌నంసాక్షి) : వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాస అధినేత కేసీఆర్‌ ఎవరిని బరిలో నిలిపినా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొనేందుకు కృషి చేస్తామని తెరాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.
జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, శ్మశాన వాటిక, డంపుయార్డు ఉండే విదంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఎన్నిక చేయబడిన సర్పంచులు గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి మరింత పెరుతెచ్చే విధంగా పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నూతన గ్రామ పంచాయతీలలో ఎక్కువగా యువకులు, మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. కేసీఆర్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇట్టి సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగ పడేలా అందరూ కృషి చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు వచ్చి మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పరిశీలించి వారి రాష్ట్రంలో అమలు చేసుకుంటున్నారని అన్నారు. దేశంలోనే అద్భుత ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ నిలిచిందని అన్నారు. ఇదంతా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే సాధ్యమైందని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ గా కేసీఆర్‌ టికెట్‌ ఎవ్వరికిచిన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. దేశంలో తెరాస పార్టీ కీలక పాత్ర  పోషిస్తుందని తెలియజేసారు. ఈ సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమితి సభ్యులు, మహిళ నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.