పాలమూరు డీఆర్సీ మీటింగ్‌లో జూపల్లి నిరసన

మహబూబ్‌నగర్‌ : జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించక పోవడంతో ఆయన సమావేశంలోనే బైటాయించి ధర్నా చేశారు. దీంతో సమావేశంలో ఉధ్రిక్తత ఏర్పడింది.