పాలేరులో దూసుకెళ్లిన ‘కారు’..

TRS-608x345ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్ లో సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచా కాల్చి నృత్యాలు చేశారు. ఒకరికికరు స్వీట్లు తినిపించుకున్నారు.

ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తుమ్మల..
భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రజలకు మంత్రి తమ్మల నాగేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వంపై, తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే భారీ మెజార్టీని తెచ్చిపెట్టాయని, పాలేరుకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పాలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.