పింఛన్ల పంపిణీ

పిఎఫ్ కలిగి ఉన్న బీడీ కార్మికులకు నిరాశ
రామారెడ్డి   జనం సాక్షి  సెప్టెంబర్ 15
రామారెడ్డి మండల కేంద్రంలో నూతన పింఛన్దారులకు పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వృద్ధులు వితంతు వికలాంగుల పింఛన్లు మంజూరైన వారికి అర్హత ధ్రువపత్రాలను అందజేశామని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వర్గాలకు అనేక రకాలైన పథకాల ప్రవేశపెట్టి దేశంలోనే అత్యున్నత స్థానం సంపాదించుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమం లో బీడీ కార్మికులకు పీఎఫ్ర్య కలిగి ఉన్నవారికీ నిరశ ఎదురైంది.  ఈకార్యక్రమంలో  ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, మండల రైతు కన్వీనర్ నారాయణరెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రామ్ రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజాగౌడ్, ఎంపిటిసిలు భాగ్యలక్ష్మి, రజిత ,జిల్లా రైతు డైరెక్టర్ కాసర్ల రాజేందర్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి , సొసైటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.