పిడుగు పాటు తో ఒకరి మృతి..

.

 

. ప్రాణాలతో బయటపడ్డ తండ్రి మరో కూతురు…
బాన్సువాడ, జనంసాక్షి (జూలై 17):
బాన్సువాడ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మ్యాడ శివాని (21) ఆదివారం వ్యవసాయ పొలం పనులు చేస్తుండగా వర్షం కురుస్తుండడంతో చెట్టు కింద తండ్రి చెల్లెలుతో కలిసి నిలబడంతో హఠాత్తుగా పిడుగు పాటకు గురై శివాని అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగుపాటు గురైన బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి  శ్రీనివాస్, చెల్లెలు ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి కూతురు కి ఎలాంటి ప్రాణాపాయం  లేదని తహాసిల్దార్ గంగాధర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Attachments area