*పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి*

-ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి

మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): మొదటి సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపల ఉన్న చిన్నారులకు, విద్యార్థులకు, యువతి, యువకులకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను వేయాలని ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు ఆమె ఆల్బెండజోల్ గోలీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు మట్టిలో ఆడడం, గోళ్లు ఉండటంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం ద్వారా కడుపులో నులిపురుగులు తయారవుతాయని, తద్వారా పిల్లలకు ఆకలి మందగించి రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మెడికల్ సిబ్బంది సహకారంతో తప్పనిసరిగా వారి విద్యాసంస్థల్లో ఆల్బెండజోల్ గోలీలను ప్రతి విద్యార్థికి వేయాలన్నారు. ప్రభుత్వం చిన్నారులకు సరిపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, సబ్ సెంటర్లకు మందులను అందించిందని తెలిపారు. చిన్నారులకు యువతి, యువకులకు ఆల్బెండజోల్ గోలీలను పంపిణీ చేయని ఏరియాలోని ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రజిత, మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు యాదా రమేష్, హెల్త్ సూపర్వైజర్ షాబుద్దీన్, ప్రధానోపాధ్యాయులు సీతారామరాజు, ఏఎన్ఎం లక్ష్మి, ఆశ కార్యకర్తలు, విద్యా వాలంటరీ తదితరులు పాల్గొన్నారు.