‘పీపుల్స్‌వార్‌’ అధ్భుతం : కేసీఆర్‌

హైదరాబాద్‌: దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తీసిన ౖౖ’పీపుల్స్‌వార్‌’ సినిమా అద్బుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్‌ తెలిపారు. ‘పీపుల్స్‌వార్‌’ ప్రివ్యూ చూసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని ఈ సినిమాలో నారాయణమూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల వల్ల మానవమక్కులకు, పర్యావరణానికి ఎలా నష్టం కలుగుతుంతో అద్భుతంగా చూపించారని తెలిపారు. సినిమాలో సోంపేట ఉద్యమకారులే హీరోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు వలన్లు అని అన్నారు. సామజిక అంశాలను మానవీయ కోణంలో చూసే కళాకారుడు నారాయణమూర్తి అని కేసీఆర్‌ కొనియాడారు. సెప్టెంబర్‌ 14న ‘పీపుల్స్‌వార్‌’ సినిమా విడుదల అవుతుందని చెప్పారు. విడుదల రోజు కూడా సినిమా చూస్తానని తెలిపారు.