పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

దోమ: రాకొండ గ్రామానికి చెందిన శ్రీశైలు (19)అనే యువతి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీశైలు పరిగిలోని పల్లవి కళాశాలలో బీఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి కృష్ణయ్య ఏడాది కాలంగా పెళ్లి చేసుకుంటానని తరచూ ఫోనులో వేధిస్తుడుండే వాడు. ఇదే తరహాలో గురువారం ఫోను చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీశైలు శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషయంచడంతో అక్కడ నుంచి వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమె శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. తల్లిదండ్రుల
ఫిర్యాదు మేరకు శనివారం దోమ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.