*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) మండలంలోని కక్కిరేణి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆరో తరగతి బ్యాచ్  (1980- 1986) ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం  నిర్వహించారు. దుర్గం బలరాం  అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారికి చదువు చెప్పిన గురువులు దాచేపల్లి రంగయ్య , గాయం ప్రభాకర్ రెడ్డి , పిట్ట దామోదర్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.
కక్కిరేణి పాఠశాలలో 40 సంవత్సరాల క్రితం ఆరవ తరగతి వరకు చదువుకొని వివిధ రంగాలలో పై స్థాయికి ఎదిగిన ఉన్న ఊరి మమకారంతో అందర్నీ ఒక్కతాటి చేసి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం మా బ్యాచ్ తరపున సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయులు ఏ. కనకసేన, కార్యక్రమ నిర్వాహకులు శిగ వెంకటేశ్వర్లు , సింగిల్ విండో డైరెక్టర్ పిట్ట రాంరెడ్డి , వార్డు సభ్యులు వేముల సైదులు , పూర్వ విద్యార్థులు పిట్ట రవీందర్ రెడ్డి , మిర్యాల శ్రీనివాసులు, యస్. జెలెందర్ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి , గణేష్ , యోగితా భాలీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area