పెళ్లి వ్యాన్ బోల్తా : ఐదుగురి మృతి

99పరిగి: పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వికారాబాద్‌ మండలం ద్యాచారం నుంచి షాబాద్‌ మండలం ఉత్తరాస్‌పల్లికి 60మందితో వెళ్తున్నడీసీఎం వ్యాను ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో దోమ మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ(32), షాబాద్‌ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన అనసూయ(30), అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.