పేటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అశ్వారావుపేట, సెప్టెంబర్ 18( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజన చట్టాలు అమలు చేయడంలో మరింత చొరవ తీసుకొని పోడు భూముల సమస్యలను రూపుమాపేందుకు జీవో పాస్ చేయడానికి తీసుకున్న నిర్ణయం పట్ల తెరాస పార్టీ నాయకులు రాజమోహన్ రెడ్డి, తెరాస మండల ప్రధాన కార్యదర్శి జుజ్జూరు వెంకన్న బాబు, సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ రావు, కల్పాల శ్రీనివాసరావు, పలువురు గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు పోడు భూముల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, గిరిజనుల సమస్యలను తీర్చేందుకు ముఖ్యమంత్రి జీవో పాస్ చేస్తున్న ప్రకటన చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే గిరిజనులకు ‘గిరిజన బందు’ పథకం ద్వారా వెనకబడ్డ గిరిజనులకు లబ్ధి చెందే విధంగా నిర్ణయం తీసుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.