పేదలకు అండగా నిలిచిన “శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్”.

 

– విభిన్న వర్గాలకు ఆర్థిక సహాయం అందజేత.

మంగపేట, సెప్టెంబర్7 (జనంసాక్షి):-
“శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్”ఆధ్వర్యంలో పలువురు అభాగ్యులు, బాధితులకు, బుధవారం నగదు ఆర్థికసాయం అందించారు.తిమ్మంపేట గ్రామానికి చెందిన నిరు పేద కుటుంబానికి చెందిన చినపెళ్ళి రమేష్ (31) ఐదేళ్ల క్రితం ఓ రైతు పంట పొలం వద్ద మోటర్ మరమ్మత్తు పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తో కాళ్ళు,చేతులు చచ్చుపడిపోయాయి.అప్పటి నుంచి పనులు చేయక మంచానికే పరిమితం అయ్యాడు.అతనిది నిరుపేద కుటుంబం రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితి. అతని దుస్థితి తెలుసుకున్న “శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్” అతడికి రూ,2500 లు నగదు సాయం అందించారు. అలాగే మంగపేట మండలంలోని పొదుమూరు గ్రామానికి చెందిన ఎల్లందాసరి. కొండల్ ఇటివల అనారోగ్యంతో మృతిచెందాడు .వారికుటుంబాన్ని కలిసి ,ఓదార్చి దశ దిన కర్మల నిమిత్తం రూ,2500 లు అందజేశారు. అదే విధంగా మంగపేట మండలం జబ్బోనిగూడెం గిరిజన గ్రామంలో ని గిరిజనుడు జబ్బ సాంబయ్య కు అనారోగ్యంతో బాధపడుతూ కాలు ఇన్ఫెక్షన్ తో కాలు తీసివేయగా ఆర్థిక పరిస్థితి ఏర్పడి ఇబ్బoది పడుతున్నాడు, లేవలేని పరిస్థితిలో ఉండి హాస్పిటల్ కూడ చూపించ లేని పరిస్థితుల ఉన్న అతనికి “శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ “చైర్మన్ నాగ రమేష్ సహృదయంతో స్పందించి తక్షణ సహాయంగా రూ, 2500/-లు అందజేశారు. అదే విధంగా అదే గ్రామంలో జబ్బ యశోద నగేష్ దంపతుల కుమారుడు శిరీష్ కుమార్ పాముకాటు తో ఇటీవల మృత్యువాత పడగా వారి కుటుంబాన్ని పరామర్శ చేసి రూ,2500 ల నగదు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు వైస్ చైర్మన్ బాడిశ నవీన్, సామ మోహన్ రెడ్డి,పరమేశ్వర్ రావు,బట్ట నరసింహ రావు, నరసింహ మూర్తి,కోరం వెంకన్న, సోయం శేఖర్,ట్రస్ట్ సభ్యులు బాడిశ ఆది నారాయణ,చౌలం సాయి బాబు,చౌలం వేణు,మంచాల నాగేంద్ర కుమార్, చిట్యాల రాజశే ఖర్,చెట్టుపల్లి రామ కృష్ణ,బొడ ప్రవీణ్,ఇందారపు రమేష్,కను కుంట్ల నాగరాజు,గుగ్గిళ్ల సురేష్, గ్రామస్తులు లంజపెల్లి పుల్లయ్య,ఎల్లo దాసరి సతీష్,లంజపెల్లి వెంకటేష్, లంజ పెల్లి అనిల్,దాసరి నరేష్, శ్రీను,దిగొండ కాంతారావు,చెట్టుపల్లి ముకుందం,పుల్లూరి తిరుపతి, నర్సింహారావు,దుర్గం నర్సింహా రావు,జాడి రమేష్,ముడ్రాతి సాంబయ్య,లొంక్క రాజు,గుండు నాగయ్య,బంటు నాగరాజు,రఫీ, పాల్గొన్నారు.