పేదలకు దుప్పట్ల పంపిణీ.

బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలను గుర్తించి దాతల సహకారంతో చలి తీవ్రత నుంచి ఉపశమనం కొరకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణికి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శి పతంగి సంతోష్ పాల్గొన్నారు.