పేద కుటుంబాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

సికింద్రాబాద్ ( జనం సాక్షి )    సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ పరిధికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ.13,01,508/- విలువ చేసే చెక్కులను  డిప్యూటీ స్పీకర్  టీ.పద్మారావు గౌడ్ తో కలిసి హైదరబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి,   మోతే శోభన్ రెడ్డి , యువ నాయకుడు టీ.రామేశ్వర గౌడ్ , చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్  మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని అన్నారు. రాష్ట్రంలో  సీఎం కేసీఅర్  ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం అన్నారు.  ఈ కార్యక్రమంలో తెరాసా సీనియర్ నాయకుల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.