పేద వాళ్ల గుండెచప్పుడు వైఎస్ఆర్……..

*ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు……
***యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్…..
టేకుమట్ల.జులై08(జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వేడుకలను మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్  ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను చిరునవ్వుతో పలకరించే ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడి జయంతిని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని రాజశేఖర్ రెడ్డి సజీవంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల కోసం కష్టపడిన తీరు వారిని ఎప్పుడు ప్రజల ఆలోచనల్లో సజీవంగానే ఉన్నారని అన్నారు.ముఖ్యంగా యువతకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు ఆరోజు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్,రాజీవ్ కిరణాల ద్వారా ఉద్యోగ ఉపాధి విద్యపై పూర్తిగా శ్రద్ధ పెట్టి యువతను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లారని అన్నారు. పేదవాడి గుండెచప్పుడు ఆరోగ్యశ్రీ,పేదలకు ఇందిరమ్మ ఇల్లు,రైతులకు ఉచిత కరెంటు, మహిళలకు అమ్మహస్తం లాంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంగా భావించి ప్రేమగా రాజన్న అని పిలిస్తే పలికే నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని వారు హితవు పలికారు. రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్నారు వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చి పిసిసి అధ్యక్షునిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభా పక్ష నాయకునిగా,రెండుసార్లు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ వారి కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వారికి కూడా అండగా నిలిచింది.యువజన కాంగ్రెస్ ను రాజశేఖర్ రెడ్డి ఆదర్శం వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా వారి ఆశయాల సాధనలో యువజన కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటానని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం ఓదెలు,సంతోష్,గోనెపల్లి సంపత్,మధుకర్ యువజన కాంగ్రెస్ నాయకులున వైనాల యశ్వంత్,పెరుమండ్ల క్రాంతి, బందెల శ్రావణ్, మనోజ్, రమణ,రమేష్,మహేష్, తదితరులు పాల్గొన్నారు.