పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు పేరు కుపోవడంతో 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. 15 సర్వీసుల సమయాల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా నిన్న 60 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.