పోడు రైతుల ఆధ్వర్యంలో కెసిఆర్ గారి, ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం.

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పోడు రైతులు
అశ్వరావుపేట అక్టోబర్ 12( జనం సాక్షి )
అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెo గ్రామం లో కెసిఆర్ చిత్రపటానికి పోడు రైతులు పాలాభిషేకం చేశారు. భూములకు సర్వే చేసి, పోడు భూములకు త్వరలో పట్టాలు వస్తాయని హర్షం వ్యక్తం చేస్తూ,పోడు రైతుల ఆధ్వర్యంలో కెసిఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది.అనంతరం స్వీట్స్ పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ పాల్గొని పోడు రైతులకు త్వరలోనే పట్టాలు వస్తాయని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకలా గురించి చెప్పడం జరిగింది. గిరిజనుల కోసo త్వరలోనే గిరిజన బంధు,10% రిజెర్వేషన్ కూడా వర్తిస్తుందని, మళ్ళీ ప్రభుత్వం బిఆర్ స్ పార్టీ వస్తుందని, , గిరిజనులు కూడా అన్ని రంగాలలో ముందుడాలని అలోచించె ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని సంతోషం వ్యక్తం చెయ్యడం జరిగింది. ముఖ్య అతిధి గా విచ్చేసిన అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ ని గ్రామస్తులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం గ్రామ కమిటీ బిఆర్ స్ పార్టీ అధ్యక్షులు సున్నం మంగయ్య, ధర్ముల వెంకటేష్, వెట్టి ప్రసాద్,యువజన కమిటీ సభ్యులు సున్నం సురేష్, రవ్వ శ్రీను, కూరం రాజేష్, గోరం బుల్లెమ్మా, మడకం చుక్కమ్మ,కొరస గంగదేవి, కొరస రమాదేవి,గ్రామ పెద్దలు, గ్రామస్తులు, గ్రామ మహిళలు,గ్రామ యువత, బిఆర్ స్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.