పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు సరిగ్గా చూసుకోవాలి

మహా ముత్తారం నవంబర్ 11 (జనం సాక్షి)ఈ నెల 30 రోజు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహ ముత్తారం మండల పరిధిలోని కోర్లకుంట గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శ్రీ శ్రీధర్ గౌడ ఐఏఎస్ సెంట్రల్ ఆబ్సర్వర్ గారు ఆకస్మికంగా తనఖీ చేసి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మండలంలో అన్ని గ్రామాలలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు సరిగా ఉండాలని పోలింగ్ శాతం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ఆయన సూచించారు.
అధికారులందరూ ఎప్పటికప్పుడు ఆదేశాల అనుసారం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.ఆయన వెంట తహసీల్దార్ డి. శ్రీనివాస్, యంపిడిఓ పెద్ది ఆంజనేయులు యంపిఓ యం శ్రీనివాస్ రావు యస్.ఐ సుధాకర్ పంచాయతీ కార్యదర్శి బాపు, బి.యల్.ఓ ప్రతిభ గ్రామ పంచాయతీ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.