పోలిస్ ఠాణాలో హరితహారం

బిచ్కుంద జులై 21 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో గురువారం నాడు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది 25 మొక్కలను నాటారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వలయాధికారి కృష్ణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.