పోలీసుల కస్టడీలో గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను

jyo2మహబూబ్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం, బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమా బేగంను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం ఆగడాలపై కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు.