పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వ్యాసరచన పోటీ లు

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )మండల కేంద్రం ఎంఆర్సి భవనంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరిగింది, క్విజ్ పోటీలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు మొదటి బహుమతి, పెద్దవంగర హైస్కూల్ ద్వితీయ బహుమతి అందుకున్నారు, వ్యాసరచన పోటీలో వడ్డెకొత్తపల్లి హైస్కూల్ నుండి కే సందీప్ మొదటి బహుమతి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మంగళంపల్లి హుస్సేన్, స్థానిక ఎస్సై రియాజ్ పాషా, నేషనల్ హ్యూమన్ రైట్స్ స్థానిక మండల చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి, నోడల్ హెచ్ఎం బుచ్చయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భద్రయ్య చారి, ఎర్రగొర్ల రమేష్, మాచర్ల శ్రీనివాస్, నవీన్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.