పోస్టల్ సేవలను ఉపయోగించుకోండి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్

గరిడేపల్లి మండలంలోని గానుగబండ  గ్రామంలో శుక్రవారం పోస్టల్ సేవల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ పంగ వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రజలు అందరు పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. పోస్టల్ శాఖ ఎంఓ బిపిఎం ఎబిపిఎం మాట్లాడుతూ గ్రామాలలో  పోస్టల్ శాఖ ద్వారా అందుతున్న ఆర్డి ఆర్ పి ఎల్ ఐ పి ఎల్ ఐ ప్రమాద బీమా టాటా ఏసీ వారి సేవలు  అందరు ఉపయోగించుకొని ప్రయోజనాలు పొందుతూ ఆర్థికంగా లాభాలు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఎంఓ  కోటయ్య ,బిపిఎం  సైదులు ,ఏబీపీఎం  సంజీవ్,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.