*ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ నాయకులు*

పెద్దేముల్ అక్టోబర్ 18 (జనం సాక్షి)
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దేముల్ టిఆర్ఎస్ నాయకులు మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని ఉడతలపల్లి, కొటాయిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా మంగళవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్, సర్పంచ్ లు జనార్దన్ రెడ్డి, భరత్ లు ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సీఎం ఎంతో కృషి చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ప్రతి ఒక్కరు ఇతర పార్టీల వారు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని అన్నారు.
Attachments area