ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్ పార్టీ
ఘటకేసర్ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. ఘటకేసర్లో జరిగిన మేడ్బల్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ 100 స్థానాలు బీసీలకు కెటాయించడంతో వారు అర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.