ప్రజావాణి పిర్యాదుల త్వరితగతిన పరిష్కారం చేయండి..ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల రూరల్ ఆగస్టు 29 (జనంసాక్షి):-  ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో పరిష్కరించడం జరుగుతుందని  జిల్లా  ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్  తెలియజేశారు.ప్రజావాణిలో లో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజల నుండి వచ్చిన 08  ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబందించిన సివిల్ వివాదాలను కోర్టులలో పరిష్కరించుకోవాలని సూచించారు.కుటుంబాలలో అస్థిపంపకాలలో  చిన్న చిన్న సమస్యలకు ఒకరి పై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటి  సంఘటనల పై ఫిర్యాదులు రావడం గురించి విచారం వ్యక్తం చేశారు. భర్తల వేధింపుల పై, చీటింగ్ ల పై ఫిర్యాదులు అందాయని అందుకు కారకులు అయిన వారి పై   చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులలో భర్త వేధింపులకు సంబంధించి -01 పిర్యాదు.కుటుంబ తగాదాలకు
 సంబంధించి -02 పిర్యాదులు.
భూ వివాదాలకు సంబంధించి 02 పిర్యాదులు.
డబ్బులు తీసుకొని ఇల్లు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని 02 ఫిర్యాదులు. పొలం లో అక్రమంగా కాల్వ తీశారని 01 పిర్యాదులు వచ్చినట్లు తెలిపారు…