ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలిప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలి– టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరి బాలరాజు

టేకులపల్లి, నవంబర్ 9( జనం సాక్షి ): ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతను  నిర్మించుకోవాలని టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, తావురియా తండ గ్రామపంచాయతీలలో జరుగుచున్న ఇంకుడు గుంటలు నిర్మాణాలను, మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామపంచాయతీ లలో  కూలీలు ఉపాధి పథకం పనులకు హాజరు కావాలని  ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలకు మట్టితోలకాలు చేయాలని, ప్రతి ఒక్కరి ఇంటికి ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని, అందుకు సిబ్బంది గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కాలంగి శ్రీనివాస్, ముత్యాలంపాడు గ్రామ సర్పంచ్ మాలోతు సురేందర్, కార్యదర్శి అజయ్, క్షేత్ర సహాయకులు లకన్ లు పాల్గొన్నారు